జగన్ గారి తరువాతి దీక్ష ఐక్య రాజ సమితిలో !

Friday 25 February 2011

ఓ............... దార్పు  యాత్రలు కొనసాగుతున్నాయి !
లక్ష్య (లక్ష) దీక్ష, జల దీక్ష, ఫీజుల దీక్ష అయిపోయాయి !
ఎంతో శ్రమ  పడి (ఖర్చు పెట్టి ) జన సమీకరణలు చేసినా సొంత పేపర్ లో, సొంత చానెల్ లో ఇంకా లోపాయకారీ సంభందాలు ఉన్న ఒకటి రెండు చానెల్ ల లో తప్ప ఎక్కడా ఆయన ఊసే కనిపించడం లేదు ! ఇంకేమి చేస్తే జనం (సోనియా) గుర్తించి తనకు అధికార పీఠం  దగ్గరయ్యే  అవకాశం వస్తుందో అని ఆలోచిస్తే అకస్మా
త్తుగా తట్టింది ! విజయవాడలో మొదలుపెట్టి డిల్లీ, హైదరాబాదు కూడా అయిపోయినాక 
ఇంక ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా చేస్తే తప్ప గుర్తింపు రాదేమో అని అనిపించింది !   
వెంటనే ఒక నెలరోజులు ఐక్యరాజ సమితి ముందు జనసమీకరణ చేసి దీక్ష చేస్తే చచ్చినట్లు జగం గుర్తించి హైదరాబాదూ,  ఇండియా ఎందుకు ప్రపంచానికే నువ్వు రాజువయ్యా అంటారని సంబరం వేసింది ! జన సమీకరణకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా తండ్రి సంపాయించి పెట్టారు కాబట్టి నిశ్చయం జరిగిపోయింది !
 జగన్ గారి తరువాతి దీక్ష ఐక్య రాజ సమితిలో !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )